Breaking News

నృత్యకారిణి డా.శోభానాయుడు ఇక లేరు

హైదరాబాద్‌: ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ డా.శోభానాయుడు(64) కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంగళవారం అర్ధ రాత్రి 1:40కి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె కొంతకాలంగా న్యూరోలాజికల్ సమస్యతో చికిత్స పొందుతున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో 1956లో శోభానాయుడు జన్మించారు. 12 ఏళ్ల వయసులో కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరారు. సత్యభామ, పద్మావతి పాత్రల్లో రాణించారు. హైదరాబాద్‌ కూచిపూడి ఆర్ట్‌ అకాడమీకి ఆమె ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. కూచిపూడి నృత్యంలో వందల మందికి శిక్షణనిచ్చారు.

శోభానాయుడు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1998లో ఎన్టీఆర్‌, 1982లో నిత్య చూడామణి, 1991లో సంగీత నాటక అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. యూకే, సిరియా, టర్కీ, హాంకాంగ్‌, మెక్సికో, వెనిజులా, క్యూబా తదితర దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *