Breaking News

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి వేడుకలు

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట మైన్స్ యూనిట్ నందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్క్ నందు ఘనంగా నిర్వహించారు. నేతాజీ విగ్రహం నకు మైన్స్ ఇన్చార్జి బి యు వి యెన్ రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ నేతాజీ బాటలో మనమందరం నడవాలి అని చెప్పారు భారతీయులు తమ దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తించి దేశ కీర్తి ప్రతిష్టలు పెంపుదలకు కృషి చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో అదికారులు కార్మిక నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *