Breaking News

పంచాయతీ ఎన్నికల్లో వై సి ఫై పార్టీయే సత్తా చాటాలి : డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

తెలుగు తేజం, వీరులపాడు : అల్లూరు గ్రామంలో మాజీ సర్పంచి కోటేరు సూర్య నారా యణరెడ్డి నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పంచాయతీ ఎన్నికల పై సమీక్ష సమావేశం బుధవారంనిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరులపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని అందుకు ప్రత్రి వై సి ఫై కార్య కర్త సైనికుడిలా కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ,ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు చేసిన అభివృద్ధే వీరులపాడు మండలం లో గెలుపు బాటలు వేస్తుందని తెలిపారు. అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. పోటీ చేసే అవకాశం లేకుండా ఉన్న అభ్యర్థులకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, భవిష్యత్తులో వారికి తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కోటేరు ముత్తా రెడ్డి, జిల్లా కార్యదర్శి ఆవులరమేష్ బాబు. షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, కంచికచర్ల మార్కెట్ యార్డ్ నువ్వుల విశ్వనాథం, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బొమ్మిశెట్టి భాస్కర్ రావు, వీరులపాడు జడ్పిటిసి అభ్యర్థిని అమర్లపూడి కీర్తి సౌజన్య, పలు గ్రామాల నుంచి వచ్చిన వైయస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *