Breaking News

పటమట ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ స్కామ్

గోల్డ్‌కాయిన్‌ ఎర చూపి దోచేసిన సంస్థ మేనేజర్‌


తెలుగు తేజం, విజయవాడ : ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ స్కామ్ జరిగింది. కోటిన్నర విలువైన బంగారాన్ని మేనేజర్ వీరబాబు మాయం చేశాడు. కంపెనీతో సంబంధం లేకుండా మేనేజర్ వీరబాబు గోల్డ్ స్కీమ్ పెట్టారు. స్కీమ్ ద్వారా గోల్డ్ డిపాజిట్ చేస్తే గ్రాము బంగారం ఉచితంగా ఇస్తామంటూ మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో వీరబాబుతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు అయింది. పటమట తోటవారి వీధికి చెందిన సౌమ్య గత ఏడు సంవత్సరాలుగా హైస్కూల్‌ రోడ్డులోని బంగారం ఫైనాన్స్‌ చేసే సంస్థలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల కిందట బ్రాంచి మేనేజర్‌ వీరబాబు ఇంకా బంగారాన్ని కుదవపెడితే గోల్డ్‌కాయిన్‌ బహుమతిగా అందిస్తున్నట్లు ఆమెకు తెలిపారు. దీంతో సౌమ్య రెండు విడతలుగా 300 వందల గ్రాముల ఆభరణాలను తెచ్చి ఉంచారు. అయితే ఇటీవల ఆమె బ్రాంచిలోని నూతన మేనేజర్‌ను కలిసి విషయాన్ని అడగగా, అలాంటి బహుమతులు ఇవ్వడం లేదని, గత మేనేజర్‌ వీరబాబు తమిళనాడుకు బదిలీ అయ్యారని చెప్పారు. బంగారం కుదవ పెట్టిన సంగతి విచారించగా, వాటికి సంబంధించి వివరాలు ఏమీ లేవన్నారు. ఇదంతా సంస్థకు సంబంధం లేకుండా పాత మేనేజర్‌ చేశారని తేలింది. దీంతో బాధితురాలు గురువారం పటమట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరికొందరు ఇలాగే మోసపోయినట్లు తెలుసుకొని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు 2.750 కిలోల బంగారం ఇలా కొట్టేశాడని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *