Breaking News

భారత్ లో 90 లక్షలు దాటిన కరోనా కేసులు

24 గంటల్లో కొత్తగా 45,882 కేసులు.. 584 మరణాలు

దిల్లీ: దేశంలో ఇటీవల కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. ఇప్పుడు మళ్లీ ఆ సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 90 లక్షల మార్కును దాటేసింది. కేవలం 22 రోజుల్లోనే పది లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం. కేసుల పరంగా అమెరికా తరవాత భారత్ రెండో స్థానంలో ఉంది.

తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 45,882 కొత్త పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అయితే, క్రియాశీల కేసులు ఐదు శాతానికి దిగువన ఉండటం ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,43,794గా ఉండగా.. ఆ కేసుల రేటు 4.93 శాతానికి తగ్గింది. అలాగే రికవరీల సంఖ్య 84,28,409 (93.60 శాతం)గా ఉంది. ఈ మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 584 మంది మరణించారు.

దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,32,162కి చేరింది. నిన్న ఒక్కరోజే 10,83,397 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *