Breaking News

పట్టణ పరిశుభ్రతకు సహకరించండి : కమిషనర్ సుభాష్ చంద్రబోస్

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పురపాలక సంఘం చేస్తున్న ప్రయత్నానికి అందరూ సహకరించాలని కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కోరారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. స్థానిక మాంసం మార్కెట్ నిర్వహణపై పలు సూచనలు చేశారు. మాంసం విక్రయదారులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే జరిమానా విధిస్తామన్నారు. వృధాగా ఉన్న పురపాలక వాహనాలకు మరమ్మత్తులు చేయించాలని మరీ పాడైపోతే వేలం వేయాలని సూచించారు. వృద్ధ విరామకేంద్రాన్ని పరిశీలించిన ఆయన అక్కడ అవసరమైన మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించిన వారు ఉంటే తప్పకుండా అనుమతి పొందాలని కమిషనర్ సూచించారు. లేఅవుట్లు క్రమబద్ధీకరణకు ఈ నెల 31 వరకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ అన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *