Breaking News

పడమట పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత – నల్లబ్యాడ్జీలతో ఒక్కసారిగా పీఎస్ ను చుట్టుముట్టిన టీడీపీ నేతలు

తెలుగుతేజం (విజయవాడ రూరల్ ప్రతినిధి):
విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడిపి నేతలు ఒక్కసారిగా నల్ల బ్యాడ్జీలు ధరించి పోలీస్ స్టేషన్ చుట్టు ముట్టారు.చెన్నుపాటి గాంధీ కేసును పోలీసులు నీరు గారుస్తున్నారని టీడీపీ ఆరోపణ – గాయం నివేదిక లేకుండా కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించిన తీరుపై నిరసన – ఎఫ్ఐఆర్ కాపీలు, వైద్యుల నివేదికలతో పోలీసుస్టేషన్ వద్ద టీడీపీ నిరసన – విజయవాడ టీడీపీ కార్యాలయం వద్ద నుంచి పోలీస్ స్టేషన్ కు ర్యాలీగా తరలివచ్చిన నేతలు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, గన్నవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అడుసుమిల్లి జయప్రకాష్, వర్ల రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *