Breaking News

పవిత్రోత్సవాలు లో పాల్గొన్న సామినేని ఉదయభాను

జగ్గయ్యపేట రూరల్ (తెలుగుతేజం) మండలంలోని తిరుమలగిరి గ్రామములో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్తానము నందు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహనధికారి ఎస్ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 .30 గంటలకు చివరి రోజు పవిత్రోస్తావలు జరిగాయి. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను
శ్రీ స్వామి వారికి తులసిదళాలు అందజేసారు.
అనంతరము పూర్ణాహుతి కార్యక్రమము జరిగింది. తదుపరి శ్రీ స్వామి వారికి లక్ష తులసి పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమములో 50 మంది ఋత్వికులు, యాగ్నిక బ్రహ్మ శ్రీ పరాంకుసం వాసుదేవాచార్యులు వారు మరియు ఆలయ ప్రధాన అర్చకుల శ్రీ తిరునగరి రామకృష్ణమాచార్యులు వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. నేటితో పవిత్రోత్సవములు పూర్తి అయివున్నవని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహనధికారి ఎస్ చంద్ర శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమములో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ కాకనబోయిన నరసింహారావు మరియు సభ్యులు ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. 

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *