Breaking News

పాత మలక్‌పేటలో కొనసాగుతున్న రీపోలింగ్‌

హైదరాబాద్‌ : పాత మలక్‌పేటలోని 69 కేంద్రాల్లో ఉదయం 7గంటలకు రీపోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 276 మంది అధికారులు పోలింగ్‌ విధుల్లో ఉన్నారు. రిటర్నింగ్‌ అధికారి సంధ్యారాణిని బాధ్యతల నుంచి తప్పించి ఆమె స్థానంలో శైలజను నియమిస్తూ ఎన్నికల అథారిటీ లోకేష్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. మంగళవారం పోలింగ్‌ మొదలైన రెండు గంటల తర్వాత బ్యాలెట్‌ పత్రాల్లో కంకి కొడవలి(సీపీఐ)కి బదులు సుత్తి కొడవలి ఉన్నట్లు గుర్తించిన సీపీఐ అభ్యర్థి ఫిర్దౌస్‌ ఫాతిమా ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే.

మంగళవారం ఎన్నికలు నిలిపివేసేసరికి 3450 మంది ఓటు వేశారు. వీరికి గురువారం ఎడమ చేతి చూపుడు వేలుకు కాకుండా మధ్య వేలికి సిరా చుక్క వేస్తున్నారు. రీపోలింగ్‌ సందర్భంగా ఆ ప్రాంత పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, వ్యాపార కేంద్రాలకు గురువారం సెలవు ప్రకటించారు. 54,502 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

బరిలో ఉన్నవారు: కనబోయిన రేణుక(భాజపా), జువేరియా ఫాతిమా(ఎంఐఎం), పగిల్ల శాలిని(తెరాస), ఫిర్దౌస్‌ ఫాతిమా(సీపీఐ), బి.వీరమణి(కాంగ్రెస్‌), ఎం.కవిత (స్వతంత్ర).

బ్యాలెట్‌ పత్రాల్లో మారిన పార్టీల గుర్తులతో 26వ వార్డు పాత మలక్‌పేటలో నిలిచిన పోలింగ్‌ను ఇవాళ నిర్వహిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *