Breaking News

ప్రతి బుధ, శుక్రవారాల్లో “జగనన్నకు చెబుదాం”- కలెక్టర్

మచిలీపట్నం, సెప్టెంబర్ 8 : ప్రజల సమస్యలు పరిష్కరించి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తి స్థాయిని పెంపొందించేందుకు “జగనన్నకు చెబుదాం”కార్యక్రమం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి బుధవారం, శుక్రవారాలలో ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం మండల కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మచిలీపట్నం జిల్లా కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాలు ప్రతి బుధవారం శుక్రవారంలలో మండల కేంద్రాల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు నెంబరు 17 75 జారీ చేసిందన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *