Breaking News

ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కఠిన శిక్షలు తప్పవు :

రోడ్డు భద్రత ఫై అవగాహన కార్యక్రమం లో ఎస్సై తలారి రామకృష్ణ

నూజివీడు : ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశంతో నూజివీడు మండల పరిధిలోని మొరసపూడి గ్రామంలో మంగళవారం రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై తలారి రామకృష్ణ మాట్లాడుతూ ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్, కార్లు నడిపేవారు సీటు బెల్టు వినియోగించాలన్నారు. లైసెన్సుతోపాటు అన్ని ధ్రువీకరణ పత్రాలు వెంట ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కఠిన శిక్షలు తప్పమన్నారు. మితిమీరిన వేగం, వాహనాల ఓవర్ టేకింగ్ వంటివి ప్రాణాంతకంగా మారతాయని హెచ్చరించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *