Breaking News

ప్రైవేటు బస్సు బోల్తా.. 40మందికి గాయాలు

తెలుగు తేజం, గుంటూరు : ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడి 40 మందికి గాయాలైన ఘటన గుంటూరు జిల్లా రొంపిచర్ల సమీపంలో నార్కట్ పల్లి- అద్దంకి జాతీయ రహదారిపై జరిగింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి కందుకూరుకు బయలుదేరిన బస్సు తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *