Breaking News

బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. 10 లక్షల నష్టపరిహారం

తాడేపల్లి : విజయవాడ బస్టాండ్లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఘటనపై విచారణ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటనపై సీఎం జగన్‌కు అధికారులు వివరాలు అందజేశారు. ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాం మీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *