Breaking News

బాధిత రైతు కుటుంబానికి పరిహారం అందచేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

తెలుగు తేజం, చందర్లపాడు : చందర్లపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కట్టా లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు బుధవారం పరామర్శించారు. ప్రభుత్వ పరిహారంగా రూ. 7 లక్షల చెక్కుని మృతిని భార్య నాగమల్లేశ్వరికి అందచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు కట్టా లక్ష్మీనారాయణ ఆత్మహత్య విషయం తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణీస్తున్నట్లు తెలిపారు ,ఈ అంశంలో నందిగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెక్రటరీని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సిసిఐ బయ్యర్ పై కూడా కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ,ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి సబ్ కలెక్టర్ సుశీల దేవి, నందిగామ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వర రావు వై ఎస్ ఎన్ ప్రసాద్, కందుల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *