Breaking News

బెజవాడ కనకదుర్గమ్మకు 12 లక్షలు వడ్డాణం బహుకరణ

తెలుగు తేజం, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత దుర్గమ్మకు రూ12 లక్షలు విలువ చేసే బంగారు వడ్డానాన్ని విజయవాడ చంద్రమౌళి పురానికి చెందిన చలసాని రూప శుక్రవారం అందజేశారు. 248 గ్రాముల బరువు ఉన్న దీనిని ఆరు వారాల నగలులో భాగంగా దుర్గమ్మకు అలంకరించ నున్నారు. మూడు నెలల క్రితం అమ్మవారికి వడ్డానం చేయించాలని మొక్కు కున్నామని తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన దాత కుటుంబానికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వారికి వేద పండితులు ఆశీర్వవచనం చేశారు. ఆలయ ఈవో సురేష్ బాబు వారికి విరాళం రసీదు తో పాటు అమ్మవారి చిత్రపటం శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *