Breaking News

మత్య శాఖ ఆధ్వర్యంలో కరోనా అవగాహన ర్యాలీ

తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం : యావత్ ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించిన కరోనా వైరస్ రాష్ట్ర ప్రజల పై అధిక ప్రభావం చూపకుండా వైసీపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని ఇబ్రహీంపట్నం మండల వైసీపీ నాయకులు తెలిపారు.మత్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కరోనా అవగాహన ర్యాలీ లో వైసీపీ నాయకులు పాల్గొని కరోనా నిర్మూలనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలను కొనియాడారు.దేశంలో ఎక్కడా జరగని విధంగా కోటికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన ఘనత ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు.కరోనా కష్ట కాలంలో అధినేత ఆదేశాల మేరకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నిత్యం ప్రజల్లో ఉంటూ విలువైన సేవలు అందించారని గుర్తుచేశారు.కరోనా లాక్ డౌన్ సమయంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలబడి తన వంతు సహాయ సహకారాలు అందించారని తెలిపారు.కరోనా నివారణ చర్యలు తప్పకుండా పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జోగి రాము,లంకె అంక మోహన్ రావు,పీత సీతా రామయ్య మరియు మత్యకారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *