Breaking News

మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న ఏపీ సీఐడీ అదనపు డీజీ

అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మరికాసేట్లో ఏపీ సీఐడీ అదనపు డీజీ మీడియాతో మాట్లాడనున్నారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన వివరాలను వెళ్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, బాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. ముందుజాగ్రత్తగా టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. నాయకుల ఇండ్ల వద్ద పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. అల్లర్లు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఇక పోలీసులు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. దీంతో పలు జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రస్తుతం చంద్రబాబు కాన్వాయ్‌ ప్రకాశం జిల్లాలోని పందిళ్లపల్లి టోల్‌గేట్‌ దాటి విజయవాడవైపు సాగుతున్నది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *