Breaking News

మానవత్వాన్ని చాటిన హ్యూమన్ రైట్స్ మిషన్ గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు…

తెలుగు తేజం, మంగళగిరి: ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హ్యూమన్ రైట్స్ మిషన్ (ఇండియా) జాతీయ చైర్మన్ శ్రీ మహేంద్ర శర్మ, సౌత్ ఇండియా కోఆర్డినేటర్ శ్రీ ఎస్ జార్జ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ జాన్ బాబు గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఫ్లైఓవర్ అండర్పాస్ ల క్రింద మరియు రోడ్లు పక్కన నిరాశ్రయులై నిద్రపోతున్న నిస్సహాయులను హ్యూమన్ రైట్స్ మిషన్ సభ్యులు తట్టి మేల్కొలిపి చలితో వణుకుతున్న అన్నార్తులకు జిల్లా అధ్యక్షులు కేతన సత్యనారాయణ గారి సమక్షంలో జిల్లా ఉపాధ్యక్షులు పారేపల్లి దుర్గాప్రసాద్ మరియు పున్నం రామారావు గారి ఆర్థిక సహాయంతో ఆహార పొట్లాలను మరియు దుప్పట్లను పంపిణీ చేయటం జరిగినది. రాత్రి 11 గంటల ప్రాంతంలో జిల్లా కమిటీ సభ్యులతో కలిసి అనాధలకు సేవ చేయటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పలువురు సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ సభ్యులు రాజశేఖర్, భాస్కర్, వెంకటనారాయణ, శివ, రామకృష్ణ, మోహన కృష్ణ, శ్రీమంత్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *