Breaking News

యన్.సి.సి రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా అల్లు సుజాత

తెలుగు తేజం, నందిగామ :నందిగామ పాత బైపాస్ రోడ్ లోని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొక్కా జార్జి ముల్లర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగినది. వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామ్ పాల్ మాట్లాడుతూ యన్.సి.సి దేశంలో 24 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నదని,17 విభాగాలతో ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా పనిచేస్తుందని,నాయకులను తయారు చేయడంలో భాగంగా విజయవాడ రూరల్ ఎనికేపాడుకు చెందిన పాస్టర్ అల్లు సుజాతను రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా నియమించినట్లు తెలిపినారు. పాస్టర్ సుజాత మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామ్ పాల్,జాతీయ అధ్యక్షులు రెవ. స్టీఫెన్ చిట్టిబాబు,రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జార్జి ముల్లర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ బాబు తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఆంధ్రప్రదేశ్లో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేస్తానని,క్రైస్తవుల పక్షంగా ప్రభుత్వానికి గొంతుకు వినిపిస్తానని త్వరలోనే కార్యాచరణ ప్రారంభిస్తానని తెలియజేశారు.ఈ సమావేశంలో ఎన్సీసీ నాయకులు హెప్సి,జస్వంతరాణి,రాజేశ్వరి,రతన్ కిరణ్,పాల్ శంకర్ రెడ్డి,హనోకు, మేరీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *