Breaking News

9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ

తెలుగు తేజం, విజయవాడ : విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీకి సమీపంలో 9 ఆలయాల పునఃనిర్మాణానికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ భూమిపూజ నిర్వహించారు. రూ.77 కోట్లతో దుర్గుగుడి అభివృద్ధి, విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. కృష్ణా నది తీరంలో గతంలో ఉన్న 9 ఆలయాలను 2016 పుష్కరాల సమయంలో తొలగించారు. ప్రస్తుతం వాటిని తిరిగి అదే స్థానంలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పునర్నిర్మించే ఆలయాలు ఇవీ..

  1. రాహు – కేతు ఆలయం
  2. సీతమ్మ పాదాలు
  3. దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం (సీతమ్మ పాదాలకు సమీపంలో)
  4. శనైశ్చర ఆలయం
  5. బొడ్డు బొమ్మ
  6. ఆంజనేయస్వామి ఆలయం (దుర్గగుడి మెట్ల వద్ద)
  7. సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం
  8. వీరబాబు ఆలయం (పోలీసు కంట్రోల్‌ రూమ్‌ సమీపంలో)
  9. కనకదుర్గ నగర్‌లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *