Breaking News

రవాణా శాఖా మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నంను ఖండిస్తున్నాం

రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్-2 అధ్యక్షుడు యం రాజుబాబు

తెలుగు తేజం విజయవాడ : రాష్ట్ర రవాణా సమాచార శాఖా మంత్రి పేర్ని నాని పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, సామాన్యుడిలా అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగిన శాంతస్వభావని వివాద రహితుడని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్-2 అధ్యక్షుడు యం రాజుబాబు అన్నారు. మంత్రి నానిపై జరిగిన ఘటనను ఖండిస్తూనామన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావులేదని ఒకరిని మరొకరు చంపుకోవడం మనేది రాక్షసత్వం అవుతుందని, మంత్రి నాని వంటి సౌమ్యునిపై దాడికి పాల్పడటం అరాచకతత్వం అవుతుందని, తన తల్లిని కోల్పోయిన బాధలో ఉంటే ఆయనపై హత్యాయత్నంకు పాల్పడటం దారుణమన్నారు. అటువంటి దుర్మార్గానికి పాల్పడిన ఎంతటివారినైనా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల పథకాలలో భాగంగా డ్రైవర్ లకు ఆర్థిక సహాయం అందించే వాహనమిత్ర పధకంలో గాని, మహిళా ప్రయాణికులకు రక్షణగా నిలిచే అభయ ప్రాజెక్టు అమలులో గాని రవాణాశాఖ తరుపున అందించడంలో పేర్ని నాని పూర్తి విశ్వాసంతో పనిచేస్తున్నారన్నారు. రవాణాశాఖ ఉద్యోగుల పక్షాన సమస్యలపై మంత్రి నాని దృష్టికి తీసుకెళ్లినప్పుడు నేను ఉన్నాను అనే భరోసా కల్పించిన వ్యక్తని, సమస్యల పరిష్కారానికి నేనేం చేయాలి అని అడిగేటువంటి గొప్ప వ్యక్తని అటువంటి వారిపై దాడికి పాల్పడటం బాధాకరమన్నారు. మంత్రి నాని పై జరిగిన హత్యాయత్నం ఘటనపై పూర్తి సమగ్ర విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు .

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *