Breaking News

రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు

.తెలుగు తేజం, నందిగామ : కృష్ణాజిల్లా, నందిగామ పట్టణంలో రేషన్ డోర్ డెలివరీ వాహనాలను తహశీల్దార్ కార్యాలయం వద్ద నియోజకవర్గ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. ఎన్నికల హామీల లో భాగంగా పేద ప్రజలకు తమ ఇంటిముందుకె నాణ్యమైన బియ్యం రేషన్ పంపిణీ చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారని నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలకు 58 డోర్ డెలివరీ వాహనాలను ప్రభుత్వం కేటాయించిందని రేషన్ షాపులకు వెళ్లి పడిగాపులు పడకుండా క్యూలైన్లలో నిలబడకుండా నేరుగా తమ ఇంటి ముందుకు వచ్చి తలుపు కొట్టి రేషన్ పంపిణీ చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకొని పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయటంలో మా ప్రభుత్వం ముందు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చంద్రశేఖర, నగర పంచాయతి కమీషనర్ నాగమల్లేశ్వరరావు నియోజకవర్గ వైపిసీ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *