Breaking News

కంచికచర్ల లో కిలో బంగారం పట్టివేత

తెలుగు తేజం, కంచికచర్ల: ఎటువంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న కిలో బంగారాన్ని కంచికచర్ల పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. పట్టణంలోని వినాయకుడి గుడి సమీపంలో షేక్ రహమాన్, మైలవరపు రాజేష్ అను ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై ఉండటంతో అనుమానించి ఎస్సైలు రంగనాథ్, శ్రీమతి లక్ష్మిలు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో ఆ వ్యక్తుల వద్ద ఎటువంటి బిల్లులు, అనుమతి పత్రాలు లేని సుమారు కేజీ బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన రహమాన్, రాజేష్, గంపలగూడెం నుండి కంచికచర్ల పరిసర ప్రాంతాలలో బంగారం షాపులకు బంగారం ఆభరణాలు విక్రయించేందుకు వచ్చారని నందిగామ రూరల్ సీఐ కే సతీష్ కంచికచర్ల పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తెలియజేశారు. కేజీ బంగారు ఆభరణాలతో పాటు 81 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు అందజేశారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *