Breaking News

రేషన్ బియ్యం అక్రమ రవాణా పై స్పెషల్ బ్రాంచ్ మెరుపుదాడి

తెలుగు తేజం , కంచికచర్ల : కృష్ణాజిల్లా వీరులపాడు మండలం చౌటపల్లి గ్రామ సమీపంలో శనివారం రాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న లారీ ని పట్టుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. అర్ధరాత్రి సమయంలో అక్రమంగా రవాణా చేస్తున్న 300 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నారు . సుమారు 17 టన్నులు ఉండవచ్చునని పోలీసులు అంచనా. దాడిలో పాల్గొన్న స్పెషల్ బ్రాంచ్ ఎస్సై మురళీకృష్ణ కానిస్టేబుల్ విజయ్. పట్టుబడిన లారీ తో సహా లారీ డ్రైవర్ ను వీరులపాడు పోలీసులకు అప్పగించిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *