Breaking News

రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న కంచికచెర్ల పోలీసులు

తెలుగు తేజం, కంచికచర్ల : ఇటీవల కంచికచర్ల మండల పరిధిలో అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై పోలీసులు ఉదృతంగా దాడులు చేస్తున్నారు. కంచికచర్ల జాతీయ రహదారి ప్రక్కన ఒక గోడౌన్లో రేషన్ బియ్యం అక్రమంగా దాచారనే పక్కా సమాచారం తో దాడులు నిర్వహించారు. పాత ఇనుప సామాను విక్రయించే స్థలంలో దాచి ఉంచిన 120 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం కేసులో ఇప్పటికే ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు .

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *