Breaking News

రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని జనసేన నిరసన దీక్ష

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే వారికీ నష్టపరిహారం చెల్లించాలని తక్షణ సహాయం కింద 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ, ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణం లో బస్టాండ్ నుండి పొట్టిశ్రీరాములు విగ్రహం దాక ర్యాలీ గా వెళ్లి అక్కడ సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం స్థానిక మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందచేశారు. అనంతరం బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ రైతు వెన్ను విరిచిన నివర్ తుఫాన్ కారణం గా ప్రభుత్వం తక్షణ సహాయం కింద 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని పూర్తిసహాయం కింద ఎకరాకు 35 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లో తునికిపాటి శివ, గోపి చారి, నవీన్, శ్రీకాంత్, హేమంత్, గోపి, బ్రహ్మం, త్రిశాంత్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *