Breaking News

సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ స్వచ్చుంధ సంస్థ వారు టాటా ట్రస్ట్ సహకారం తో కొవ్వుత్తుల తయారీలోశిక్షణ

తెలుగు తేజం, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా జగయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం కన్నెవీడు గ్రామంలో సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ అను స్వచ్చంధ సంస్థ వారు టాటా ట్రస్ట్ సహకారం తో కొవ్వుత్తుల తయారీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని చావ శ్రీధర్ వైస్సార్సీపీ అధ్యక్షులు చేతుల మీద ప్రారంభించటం జరిగింది. ముందుగా జగ్గయ్యపేట నియోజకవర్గం సమన్వయకర్త యం. రాజేశ్వరరావు . మాడ్లాడుతూ గత 4 సంవత్సరాలనుండి ఈ ప్రాంతంలో అనేక మంది యువతి యువకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి జీవనోపాధి కల్పించడం జరిగింది. శ్రీధర్ మాట్లాడుతూ సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ వారు గత 4సంవత్సరాలనుండి మన ప్రాంతంలో అనేక మంది యువతి యువకులకు శిక్షణలు ఇవ్వటం జరుగుతుంది. ఈ శిక్షణ మన గ్రామం లో నిర్వహించడం చాలా సంతోషకరమణి ఈ అవకాశని అందరు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అదేవిదంగా శిక్షణ తరువాత మార్కెట్ అవకాశాలు కూడా కల్పించాలని కోరన్నారు. అల్లాబక్షు షేక్ మాట్లాడుతూ
మా సంస్థ 2006 నుండి ఫారెస్ట్ ప్రాంతాలలో మరియు రూరల్ ప్రాంతంలో అనేక అభివృద్ధి మరియు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం నరిగిందన్నారు . ఈ కార్యక్రమం లో నియోజకవర్గం సమన్వయ కర్త యం .రాజేశ్వరరావు, మేరీ జోసెఫిన్, కుమార్ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్, వెంకట్, స్కిల్ మిత్రలు, మీరా, శ్రీదేవి, మాధవరావు మరియు 20 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ 10 రోజులు ఉంటుంది, 15 మంది యువతి యువకులకు అవకాశం ఉందన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *