Breaking News

రైల్వే ఆసుపత్రిలో ఆరోగ్య శిశువుల ప్రదర్శన

తెలుగుతేజం, ఇబ్రహీంపట్నం:
గుంటుపల్లి వ్యాగన్ వర్క్ షాపు రైల్వే ఆసుపత్రిలో శుక్రవారం ఆరోగ్య శిశువుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ సీఆర్ డబ్ల్యూడబ్ల్యూఓ/ప్రెసిడెంట్ కబిత సింకు హాజరయ్యారు. విజయవాడ రైల్వే ఆసుపత్రి పిల్లల వైద్య నిపుణులు సీతారాం మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం, ఆహార విధివిధానాలు వివరించారు. చిన్నారులకు వివిధ వయస్సుల్లో చేయాల్సిన వైద్య పరీక్షలు, టీకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను హాజరైన తల్లిదండ్రులకు వివరించారు. ఆరోగ్య శిశు ప్రదర్శనలో విజేతలైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. వ్యాధి నిరోధకతపై అవగాహన కల్పించే కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ బి.సుమలత, డాక్టర్ ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *