Breaking News

రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తి మృతి మరొక యువకునికి గాయాలు

అతివేగం,నిర్లక్ష్యం గాలిలో కలిసిన నిండు ప్రాణం

తెలుగు తేజం ,కంచికచర్ల : కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం నక్కలం పేట క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం మంగళవారం చోటుచేసుకుంది. అతివేగం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఒక యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు . వత్సవాయి మండలం వేములనర్వ గ్రామానికి చెందిన షేక్ కాసిం, వయస్సు 21 బోనకల్ మండలం బాణాపురం గ్రామానికి చెందిన సిద్దపల్లి రామకోటేశ్వరరావులు వయస్సు 19 ద్విచక్రవాహనంపై విజయవాడ వైపు వెళుతున్న క్రమంలో నక్కలం పేట క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో కాసిం అక్కడికక్కడే మృతి చెందగా రామకోటేశ్వరరావు ను 108 వాహనంలో నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ పరారీ కాగా సంఘటన స్థలానికి చేరుకున్న కంచికచర్ల ఎస్ ఐ రంగనాథ్ మృతదేహాన్ని నందిగామ మార్చురీకి తరలించారు. ప్రమాదం కారణంగా భారీగా స్తంభించిన ట్రాఫిక్ ను పోలీసులు సరి చేశారు.షేక్ ఖాసిమ్ ఎలక్ట్రిషన్ గా పని చేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంగనాథ్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *