Breaking News

లంచం తీసుకుంటూ పట్టుపడిన వైద్య ఆరోగ్యశాఖ సూపరింటెండెంట్

మంగళగిరి పరిధిలోని ఆటోనగర్ ఏపీఐఐసీ భవనంలో ఉన్న ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కమిషన్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్.లతీక్ అహ్మద్ రూ.16 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉద్యోగి బదిలీ నిమిత్తం లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *