Breaking News

లోకేశ్‌ పాదయాత్రకు తాత్కాలిక విరామం!

అమరావతి: యువగళం పాదయాత్రకు తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కొన్ని రోజులపాటు విరామం ఇవ్వనున్నారు. పాదయాత్ర శుక్రవారం నాటికి డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడకు చేరుకుంది. తెదేపా అధినేత చంద్రబాబుని పోలీసులు అరెస్టు చేయడంతో. శనివారం ఉదయం లోకేశ్‌ హుటాహుటిన బయల్దేరి విజయవాడ చేరుకున్నారు. అప్పటి నుంచి న్యాయనిపుణులతో సంప్రదిస్తూ తీరిక లేకుండా ఉన్నారు. చంద్రబాబుకు అనిశా కోర్టు రిమాండు విధించడంతో… పరిస్థితులు చక్కబడేంత వరకూ పాదయాత్రను తాత్కాలికంగా ఆపనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పరిస్థితులు సర్దుకున్నాక మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తారని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *