Breaking News

వత్సవాయి మండల బీజేపీ 2వ ప్రధాన కార్యదర్శిగా లంకెల మల్లారెడ్డి నియామకం

తెలుగు తేజం, వత్సవాయి : భారతీయ జనతా పార్టీ వత్సవాయి మండల 2 వ ప్రధాన కార్యదర్శి గా చిట్టెల గ్రామ వాస్తవ్యుడు లంకెల మల్లారెడ్డి( MBA)ని నియమిస్తూ మండలపార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకొన్నారు. ఈ సందర్భంగా లంకెల మల్లారెడ్డి మాట్లాడుతూ నాకు ఇంత గొప్ప బాధ్యతను అప్పగించినటువంటి మండలపార్టీ అధ్యక్షులు దామాల ప్రసాద్ కి, మన్నే శ్రీనివాసరావు కి , అన్నేపాగా ప్రపుల్ల శ్రీకాంత్ కి మరియు మండలపార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దామాల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి షేక్ నాగులుమీరా గారు,కోశాధికారి మన్నే నాగబాబుగారు, ఉపాధ్యక్షులు కాకాని వెంకటేశ్వరరావు, లంకెల శ్రీధర్ రెడ్డి , పిళ్ళెం కోటయ్య , బుదాటి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *