Breaking News

వన్ టౌన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శాశ్వత ఉభయానికి రూ.50,116 విరాళం

తెలుగు తేజం , విజయవాడ: వన్‌టౌన్‌ బ్రాహ్మణవీధిలో వేంచేసి ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో శాశ్వత ఉభయానికి దేసు బ్రహ్మేంద్రబాబు రూ.50,116లు చెల్లిచారని ఈఓ గెల్లి హరిగోపీనాద్‌బాబు తెలిపారు . ఈ మేరకు స్వామి వారి సన్నిధిలో నగదును ఆలయ కార్యనిర్వహణాధికారి గెల్లి హరిగోపీనాద్‌బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా దేసు బ్రహ్మేంద్రబాబుతో ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. అలాగే శాశ్వత ఉభయానికి నగదు చెల్లించిన ఉభయదాతలు స్వామి వారి బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలకు హజరుకావటానికి అవకాశముంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు, ఆలయ కమిటీ ఛైర్మన్‌ గుడిపాటి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *