Breaking News

విజయవాడ శివారులో కాల్పుల కలకలం

విజయవాడ: విజయవాడ నగర శివారులో తుపాకీ కాల్పుల కలకలం సృష్టించింది. అర్ధరాత్రి యువకుడిని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. మృతుడిని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో పనిచేసే మహేష్‌గా గుర్తించారు. కాల్పుల ఘటన విజయవాడ శివారు బైపాస్‌రోడ్డులోని బార్‌ సమీపంలో చోటుచేసుకుంది. పథకం ప్రకారమే మహేష్‌ను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీపీ బత్తిన శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని అర్ధరాత్రి పరిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *