Breaking News

వైఎస్సార్‌ సీపీ శ్రేణుల రక్తదానం: గిన్నిస్‌ రికార్డు బ్రేక్‌

మైలవరం నియోజకవర్గంలో 364 యూనిట్లు రక్తదానం

తెలుగు తేజం, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణుల రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ రక్తదాన కార్యక్రమం అత్యంత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దాదాపు 175 నియోజకవర్గాలో పార్టీ శ్రేణులు చేపట్టిన రక్తదానం 18 వేల యూనిట్లను దాటి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును బద్ధలు కొట్టింది. గతంలో రక్తదానంలో 10,500 యూనిట్లుగా ఉన్న గిన్నిస్ రికార్డ్‌ను తుడిచిపెట్టింది. ప్రస్తుత ఈ రికార్డ్‌ను వండర్ బుక్ ఆఫ్‌ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నమోదు చేసుకుంది. కాగా మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన రక్త దాన శిభిరంలో 364 యూనిట్లు రక్త దానం చేయడం జరిగింది అని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు నియోజకవర్గ పరిధిలోని గుంటుపల్లి లో 109 కొండపల్లి లో 30 ఇబ్రహీంపట్నం లో 59 యూనిట్లు ది గూడెం లో 64 జి.కొండూరు లో 51 మైలవరంలో 51 యూనిట్లో రక్తదానం చేశారు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన యువతకు కు మరియు ఈ రక్త దాన శిబిరాలు ఏర్పాట్లకు సహకరించిన వారికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పేరుపేరునా అభినందించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *