Breaking News

సంగీతానికి దేవుణ్ని కదిలించే శక్తి ఉంది – డాక్టర్ ముల్లర్

తెలుగు తేజం, యేసు రక్తమే జయం మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యాన ముద్రించి ప్రచురించిన నా మంచి యేసయ్య అనే పాటల పుస్తకమును స్థానిక బైపాస్ రోడ్ లో గల నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొక్కా జార్జి ముల్లర్ పాటల పుస్తకమును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ముల్లర్ మాట్లాడుతూ “ఈ పుస్తకం లోని పాటలను రచించి, స్వరకల్పన చేసిన నాయిని కీర్తన మరియు నిరీక్షణ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైస్తవ సాహిత్యాన్ని అన్ని రీతులుగా అభివృద్ధి పరచాలని కోరారు. క్రిస్మస్ సందర్భంగా ఈ పాటలు క్రైస్తవ సమాజం అంతటిలో అత్యంత ప్రజాదరణ పొందాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి హిజ్కీయా రాజు, జిల్లా కోశాధికారి పాల్ శంకర రెడ్డి మండల నాయకులు శాంపాల్, విల్సన్,భాగ్యరావు,కృపారావు,నెహెమ్యా,శాలెం తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *