Breaking News

సంచలనం సృష్టించిన వైజాగ్ సింహాచలం శ్రీ అప్పన్న దేవస్థానంలో 550 కిలోల ఇత్తడి కానుకలు చోరీ కేసును నాలుగు రోజుల్లోనే చేదించిన పోలీసులు

సింహాచలం దేవస్థానం కల్యాణ మండపంలో బద్రపరిచిన 550 కిలోల ఇత్తడి కానుకలు మాయమైనట్టు గుర్తించిన దేవస్థానం ఏఈవో రామారావు ఈ నెల 10న స్థానిక గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేకంగా దృష్టిసారించి విచారణ చేపట్టారు. ఇందులో ఇంటి దొంగలే దొంగతనానికి  పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు గతంలో దేవాలయంలో పనిచేసిన మాజీ  ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కె.సురేశ్, సోమ సతీశ్‌లను అనుమానించి విచారించగా విషయం బయటపడింది.ఆలయంలో పనిచేసే మరికొంత మంది తో కలసి ఆలయ వ్యర్థాల్లో కలిపి ఇత్తడి కానుకలను బయటకు తరలించినట్టు అంగీకరించారు. కానుకలను విక్రయించిన, కొనుగోలు చేసిన మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *