Breaking News

సమస్యాత్మక ప్రాంతాలలో మరింత నిఘా : ఎస్ ఐ వాసా వెంకటేశ్వరరావు

తెలుగు తేజం జగ్గయ్యపేట రూరల్ మండలం హైపర్ సెన్సిటీవ్ అయిన బలుసుపాడు గ్రామంలో పంచాయితీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ ను చిల్లకల్లు ఎస్ ఐ వాసా వెంకటేశ్వరరావు బుధవారం పరిశీలించారు. ఇంతలో పోలీస్ వారిని చూడగా పిల్లలు ఎంతో ఆనందంగా దగ్గరికి వచ్చి మాట్లాడగా పిల్లలను బాగా చదువుకోవాలని వారందరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిన్నతనం నుండే క్రమశిక్షణతో మెలగాలని వారికి ఆయన తెలియజేశారు. అనంతరం సమస్యాత్మకమైన గ్రామమైన బలుసుపాడు గ్రామంలో ముందస్తుగా శాంతియుత వాతావరణాని ప్రణాళికా బద్దంగా పరిశీలిస్తున్నామని,గ్రామంలోని సమస్యల గురించి దగ్గరలో ఉన్న ప్రజలను అడిగి తెలుసుకొని ఎటువంటి సమస్య తలెత్తకుండా అల్లర్లు జరగకుండా ఉన్నత అధికారుల సూచనల మేర కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తామని చిల్లకల్లు ఎస్ఐ వాసా వెంకటేశ్వరరావు అన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *