Breaking News

సాంఘిక బాధ్యతలను గుర్తెరిగి ప్రసార మాధ్యమాలు నడుచుకోవాలి : ఎమ్మెల్యే డా. జగన్ మోహన్ రావు

నందిగామ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా. మొండితోక.జగన్ మోహన్ రావు

తెలుగు తేజం, నందిగామ : నందిగామ పట్టణంలో వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే డా.మొండితోక జగన్ మోహన్ రావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా. మొండితోక.అరుణ్ కుమార్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య DSP నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. జగన్మోహన్ రావు మాట్లాడుతూ సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తమ కలం ద్వారా అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు ,సమాజానికి మేలు కలిగే విధంగా వార్త, విశ్లేషణలను రూపొందించే పాత్రికేయ మిత్రులకు నందిగామలో వారికి ఉపయోగపడే విధంగా కార్యాలయం ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. డా. అరుణ్ కుమార్ మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలోని జర్నలిస్టు సోదరులందరికీ ఇళ్ల పట్టాలు అందించే విధంగా ఎమ్మెల్యే డా”జగన్మోహన్ రావు గారు ఆలోచన చేశారని త్వరలోనే విలేకరులందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు ,నందిగామ పాత్రికేయుల చిరకాల వాంఛయినా అసోసియేషన్ బిల్డింగ్ ఏర్పాటు కావటం ఆనందంగా ఉందన్నారు ,పాత్రికేయ మిత్రులందరూ భేద,భావాలు లేకుండా కలిసికట్టుగా ఉండి సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా పని చేయాలని సూచించారు ,నిరాధార మరియు అసత్య కథనాలు రాసి వ్యక్తుల మనోభావాలకు భంగం కలగకుండా నడుచుకోవాలన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *