Breaking News

స్థానిక ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలుగు తేజం, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఈసి గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మరలా రాష్ట్రంలో మరోసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈనెల 8 వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసి షెడ్యూల్ రిలీజ్ చేయగా, 11 వ తేదీన ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. సింగిల్ బెంచ్ ధర్మాసనం ఎన్నికలను నిలిపివేయాలని తీర్పు ఇవ్వడంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్ కు వెళ్ళింది. మూడు రోజులపాటు ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించాయి. వాదనలు విన్న హైకోర్టు, ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *