Breaking News

స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆపలేమన్న ఏపీ హైకోర్టు… విచారణ ఈనెల 14కు వాయిదా

అమరావతి : ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆపలేమని మరోసారి స్పష్టం చేసింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా లేమని, దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను కొట్టేసింది హైకోర్టు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను ఆపలేమని స్పష్టం చేసింది ధర్మాసనం. కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించింది. విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *