Breaking News

104 మొబైల్ మెడికల్ క్లినిక్ ను అందరూ సద్వినియోగం చేసుకోండి

తెలుగు తేజం, వత్సవాయి : డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి 104 మొబైల్ మెడికల్ క్లినిక్ ద్వారా మక్కపేట గ్రామ సచివాలయం లో బుధవారం వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులను వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగినది. ప్రతి నెల ఈ వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది. ఈ సదవకాశాన్ని మక్కపేట గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో 104 డాక్టర్ శ్రావ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ పి పరిమళ రోస్, ఫైలెట్ ఎం శ్రీనివాసరావు, ఏఎన్ఎం వై చిన్న పుల్లమ్మ, ఆశా కార్యకర్తలు గ్రామ సచివాలయ వాలంటరీ లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *