Breaking News

తెలుగుదేశంపార్టీఆధ్వర్యంలోడాక్టర్బిఆర్అంబేద్కర్వర్ధంతివేడుకలు

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించిన టీడీపీ జాతీయ కోశాధికారి &మాజీ ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు

జగ్గయ్యపేట పట్టణంలొని సత్యనారాయణపురం లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమంలో శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తాతయ్య గారు మాట్లాడుతూ భీమ్ రావు రామ్ జీ అంబేద్కర్ బాబా సాహెబ్ అని ప్రసిద్ధి పొందారు ధర్మ శాస్త్ర పండితుడు భారత రాజ్యాంగ నిర్మాత రాజకీయ నాయకుడు స్వాతంత్య్ర భారత తొలి న్యాయ శాఖ మంత్రి స్వాతంత్రోద్యమ దళిత నాయకుడు వృత్తి రీత్యా న్యాయవాది ఇండియన్ బౌధుడు తత్వ శాస్త్రవేత్త బాల్యంలోనే అడుగడుగునా బాధలకు అవమానాలకు గురై భీదరికాన్ని ఎదుర్కుంటూ స్వయం కృషి తో స్వీయ ప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహా మనీషీ బాబా సాహెబ్ అంబేద్కర్ అని తాతయ్య గారు మాట్లాడారు

ఈ కార్యక్రమంలో మైనేని రాధాకృష్ణ, కన్నె బోయిన రామలక్ష్మి ప్రసాద్, యలమంచిలి రాఘవ, సంక వెంకట్రావు, గింజుపల్లి రమేష్, షేక్ సత్తార్, దులిపాళ్ల లక్ష్మణ్ రావు, షేక్ ఖాసీం, మారేపల్లి శౌరి, షేక్ అన్వర్, కటికల అనీల్,షేక్ ఎజాజ్, వేముల రామకృష్ణ, బోందుల బాలాజీ సింగ్, పబ్బిసెట్టి బాబ్జీ, రచ్చా రామారావు, కారం శ్రీను, గోంగూర నాగేశ్వరరావు, గుంటూరు ప్రసాద్, మెడక కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *