Breaking News

నూతన సర్పంచ్ కి ఆత్మీయ సన్మానం

తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వర పురం మండలం
అద్దంకివారిలంక గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నూతనం గా ఎన్నికైన గౌరవ నీయులైన శ్రీ నాతి గవరయ్య గారికి పల్లపులంక గ్రామం లో ఆత్మీయ సన్మానం జరిగింది.
అనంతరం జరిగిన కార్యక్రమం లో శ్రీ నాతి గవరయ్య మాట్లాడుతూ నన్ను గెలిపించిన పల్లపులంక గ్రామ ప్రజలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. పార్టీలకతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామి ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో పల్లపులంక గ్రామ నాయకులు శ్రీ కొత్తపల్లి పెద్ద అప్పారావు గారు కొత్తపల్లి చిన్న అప్పల స్వామి మరియు వారి కుమారులు కొత్తపల్లి శ్రీనివాస్, వెంకట రమణ, గోవింద్, రాజు, త్రినాధ్ ,బూరుగు పండు మరియు ఇతర గ్రామ నాయకులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *