Breaking News

అంగళ్లు ఘటనలో చంద్రబాబు పిటిషన్‌.. హైకోర్టులో విచారణ వాయిదా

అమరావతి: అన్నమయ్య జిల్లా అంగళ్లు ఘటనలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్‌ కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది. కేసు పూర్తి వివరాలతో హాజరు కావాలని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. నీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న సమయంలో అంగళ్లు వద్ద తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీ కార్యకర్తలు తమపై రాళ్లు విసిరారని చంద్రబాబు పిటిషన్‌ వేశారు. తన సెక్యూరిటీ సిబ్బంది కాపాడారని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. అయితే, గొడవలకు చంద్రబాబే కారణమంటూ ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *