Breaking News

అన్న క్యాంటీన్లు ఎన్ని ధ్వంసం చేసినా పేదలకు అన్నదానం చేసి తీరుతాం : బచ్చుల అర్జునుడు

జనం వైసీపీని మర్చిపోతారనే భయంతోనే అన్న క్యాంటీన్ లపై వైసీపీ విధ్వంసం సృష్టిస్తోంది : బచ్చుల అర్జునుడు

గన్నవరం తెలుగు తేజం ప్రతినిధి. గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అన్న ఎన్టీఆర్ పేరిట ఒకరోజు అన్నదాన కార్యక్రమం శాసనమండలి సభ్యుడు టీడీపి ఇంఛార్జి బచ్చుల అర్జునుడు. శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల ద్వారా తెలుగుదేశం పార్టీ పేదలకు కడుపునిండా అన్నం పెడుతుంటే దాన్ని చూసి ఓర్చుకోలేని ముఖ్యమంత్రి జగన్ కు కడుపులో మంట ఎందుకు అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు కడుపు నింపే కార్యక్రమాన్ని చేపడుతుంటే ముఖ్యమంత్రి జగన్ జీర్ణించుకోలేక వాటిని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టా డ ని ఆరోపించారు. ప్రజలు వైసీపీని మర్చిపోతార నే భయంతోనే అన్నా క్యాంటీన్ లపై వైసిపి విధ్వంసం సృష్టిస్తుందన్నారు .ఎన్ని అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేసిన పేదలకు అన్నదానం చేసి తీరుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు .వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. .భవిష్యత్తులో వైసిపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు .ఇక రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేస్తే నడిబజార్లోని అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసిప్ ప్రజల మద్దతుతో ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు , ప్రధాన కార్యదర్శులు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *