Breaking News

ఆకతాయి చేష్టలకు ఇద్దరు చిన్నారుల మృతి

నవాబుపేట: మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం ఇప్పటూరులో విషాదం చోటు చేసుకుంది. ఓ బాలుడి ఆకతాయి చేష్టలకు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వివరాల్లో వెళితే.. ఇప్పటూరులో చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో ఇద్దరు గడ్డివాములో దాక్కున్నారు. అదే సమయంలో ఓ బాలుడు గడ్డివాముకు నిప్పు పెట్టడంతో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఇద్దరినీ మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం ఛాయలు అలముకున్నాయి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *