Breaking News

ఆఫ్ఘన్‌లో ఆత్మాహుతి దాడి.. 26 మంది భద్రతా సిబ్బంది మృతి

గజ్నీ: అఫ్గానిస్థాన్‌లో భారీ ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. గజ్నీ నగరంలో జరిగిన ఈ దాడిలో ఘటనలో 23 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ దాడి ఘటనను తూర్పు ప్రావిన్స్‌ గవర్నర్‌ వహీదుల్లా జుమాజదా ధ్రువీకరించారు. అఫ్గాన్‌ మీడియా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. గజనీ నగరంలోని ఓ ప్రజా రక్షణ విభాగానికి సమీపంలో భారీగా పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 23 మంది మరణించగా.. మరో 16 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. హామ్వీ వాహనంలో భారీగా పేలుడు పదార్థాలతో వచ్చి పేలుళ్లకు పాల్పడినట్లు భద్రతా సిబ్బంది వెల్లడించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ దాడికి ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదని భద్రతా సిబ్బంది వెల్లడించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *