Breaking News

ఉంగుటూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీ

ఉంగుటూరు తెలుగు తేజం ప్రతినిధి.:
గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఉంగుటూరు లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తూ గడపగడపకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి వంశి కృషి చేస్తున్నారు. వాతావరణం అనుకూలించక పోయినప్పటికీ ఎమ్మెల్యే వంశీ పట్టువదలని విక్రమార్కుని వలె గడపగడపకు వెళ్లి ప్రజాసమస్యలు తెలుసుకోవడం ఆయన సేవా నిరతి కి దర్పణం పడుతుంది. తొలుత ఉంగుటూరు సెంటర్లో వై ఎస్ ఆర్ సి పి పతాకాన్ని ఆవిష్కరించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో గన్నవరం జెడ్ పి టి సి సభ్యురాలు అన్నవరపు ఎలిజిబెత్ రాణి నక్క గాంధీ. తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *