Breaking News

ఎగ్జిట్ పోల్స్ నిషేధం – కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 7 నుంచి మొదలుకొని నవంబర్ 30 వరకు పలు దఫాల్లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 6.30గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచారం చేయడం, ఫలితాలు ప్రచురించడం వంటివి చేయరాదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘిస్తే చట్టప్రకారం రెండేండ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఇదిలా ఉంటే, ఛత్తీస్గఢ్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 7న తొలిదశ పోలింగ్, నవంబర్ 17న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. మిజోరంలో నవంబర్ 7, మధ్యప్రదేశ్లో నవంబర్ 17, రాజస్థాన్లో నవంబర్ 25, తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *